Telugu News » Team India: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు చిల్ అవుతున్న రోహిత్‌సేన.. వీడియో వైరల్!

Team India: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు చిల్ అవుతున్న రోహిత్‌సేన.. వీడియో వైరల్!

టీమిండియా సపోర్ట్‌ స్టాఫ్‌తో కలిసి ధర్మశాల కొండల్లో విహరిస్తూ ప్రకృతి అందాల ఆస్వాదనలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్(X) ఖాతాలో పంచుకుంది.

by Mano
Team India: Rohitsena chilling before the match against England.. Video viral!

టీమిండియా(Team india) విజయోత్సాహంతో మునిగితేలుతోంది. వరుస విజయాలను అందుకుంటున్న రోహిత్‌సేన మ్యాచ్‌ ప్రాక్టీస్‌తో పాటు మధ్యమధ్యలో చిల్ అవుతున్నారు. తాజాగా తరువాతి మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండడంతో భారత్ టీం(TeamIndia) ట్రెక్కింగ్‌ చేస్తూ చిల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది.

Team India: Rohitsena chilling before the match against England.. Video viral!
ధర్మశాలలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత జట్టు 29న లక్నోలో ఇంగ్లండ్‌తో జరగనున్నమ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కివీస్‌తో మ్యాచ్ తర్వాత కావాల్సినంత సమయం లభించడంతో ట్రెక్కింగ్‌తో చిల్ అవుతోంది. సపోర్ట్‌ స్టాఫ్‌తో కలిసి ధర్మశాల కొండల్లో విహరిస్తూ ప్రకృతి అందాల ఆస్వాదనలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్(X) ఖాతాలో పంచుకుంది.

రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి వారు మాత్రం దీనికి దూరమయ్యారు. చాలాకాలం తర్వాత వారు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో వారు ఈ ట్రెక్కింగ్ అనుభూతిని మిస్సయ్యారు. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించిన భారత జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన ఐసీసీ మ్యాచ్‌లో కివీస్‌ 20 ఏళ్ల తర్వాత టీమిండియా చేతిలో ఓటమి చదిచూసింది.

టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి 10పాయింట్లు, 1,353 నెట్ రన్‌రేట్‌తో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం మన జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే ఆ మ్యాచ్‌ల్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా సంచలనం జరిగితే తప్ప భారత్ తొలి స్థానం నుంచి కిందకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

You may also like

Leave a Comment