Telugu News » Liquor Murder : మద్యం మత్తులో ప్రాణ స్నేహితుణ్ని పొడిచాడు..!

Liquor Murder : మద్యం మత్తులో ప్రాణ స్నేహితుణ్ని పొడిచాడు..!

ఆ ఇద్దరి స్నేహాన్నీ చూసి మద్యానికి కన్నుకుట్టింది. మందు సిట్టింగు లో మాటకు మాటా పెరిగి..మర్డర్ కు దారి తీసింది.

by sai krishna

ఆ ఇద్దరి స్నేహాన్నీ చూసి మద్యానికి కన్నుకుట్టింది. మందు సిట్టింగు లో మాటకు మాటా పెరిగి..మర్డర్ కు దారి తీసింది. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుణ్ని బీర్ బాటిల్ తో విచక్షణా రహితంగా పొడిచాడు.

కాసేపటికి మత్తు వీడింది. అప్పటికే ప్రాణ స్నేహితుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించి లొంగిపోయాడు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లా(Karimnagar District) రేకుర్తి(Raykurthi)లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రేకుర్తి గ్రామానికి చెందిన మావురం నాగరాజు(Mauram Nagaraju), అతని ఇంటికెదురుగా ఉంటున్న ఆటో డ్రైవర్ అజయ్ ఇద్దరూ స్నేహితులు. నాగరాజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈరోజు ఉదయం మందు పార్టీ చేసుకుందాం అనుకున్నారు.

అనుకున్నట్టుగానే పార్టీ షురూ అయ్యింది. కాసేపటికి కిక్కు నెత్తికెక్కింది. ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో అజయ్ బీరు సీసా పగులగొట్టి నాగరాజును పొడిచాడు.

(మృతుడు నాగరాజు )

అప్పటికే రెండుమూడు పోట్లు పడ్డ నాగరాజు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో నాగరాజును ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించినా లాభం లేకపోయింది.

నాగరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నాగరాజు భార్య శాతవాహన యూనివర్సిటీ(Satavahana University)లో సబ్ స్టాఫ్ పని చేస్తోంది. కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా..నిందితుడు అజయ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.నాగరాజు బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

తనకు తండ్రి కావాలంటూ రోధించింది. అజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అజయ్ తల్లిదండ్రులే నాగరాజును ఆసుపత్రికి తీసుకెళ్లారు. బతికించడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు.అయితే ఇటీవల మద్యం మత్తులో హత్య చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి.

You may also like

Leave a Comment