Telugu News » Love murder : ప్రియుడిపై ప్రతీకారంతో అతని కొడుకుని…ఏంచేసిందంటే..!

Love murder : ప్రియుడిపై ప్రతీకారంతో అతని కొడుకుని…ఏంచేసిందంటే..!

వివాహేతర సంబంధం ఓ పసిప్రాణాన్నిబలితీసుకుంది.తనతో వివాహేతర సంబంధం కొనసాగించే వ్యక్తి తనను పెళ్లిచేసుకోలేదన్న కోపంతో ఇంటికి వెళ్లి మరీ అతని కొడుకుని నిర్దాక్షణ్యంగా గొంతునులిమి చంపేసింది

by sai krishna

వివాహేతర సంబంధం ఓ పసిప్రాణాన్నిబలితీసుకుంది.తనతో వివాహేతర సంబంధం కొనసాగించే వ్యక్తి తనను పెళ్లిచేసుకోలేదన్న కోపంతో ఇంటికి వెళ్లి మరీ అతని కొడుకుని నిర్దాక్షణ్యంగా గొంతునులిమి చంపేసింది..ఓ కిరాతకురాలు.

పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీ(Delhi)లోని ఇంద్రపురి(Indrapuri) ప్రాంతానికి చెందిన నిందితురాలు పూజాకుమారికి 2019లో జితేందర్(Jitender) అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.


భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని పూజను నమ్మించి ఆమెతో జితేంద్ర సహజీవనం కొనసాగించాడు. అయితే 2022లో పూజను విడిచిపెట్టి.. తన భార్యాకుమారుల దగ్గరకు వెళ్లిపోయాడు జితేంద్ర.

దీంతో అతడిపై పూజ కోపం పెంచుకుంది. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. జితేంద్ర..తన కుమారుడు దివ్యాంశ్(11) కారణంగానే తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని పూజ భావించింది. అందుకే చిన్నారిని చంపేందుకు పథకం రచించింది.


ఆగస్టు 10వ తేదీన.. ఒక కామెన్ ఫ్రెండ్ ద్వారా జితేంద్ర ఇంటి చిరునామా తెలుసుకుంది. నేరుగా అతడి ఇంటికి వెళ్లగా…తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ సమయంలో దివ్యాంశ్( Divyansh)నిద్రపోతున్నాడు. ఇంట్లో మరెవరూ లేకపోవడం వల్ల ఇదే అదనుగా భావించింది.

ప్రతీకారంతో రగిలిపోతున్న పూజ..బాబును గొంతు నులిమి చంపేసింది. అనంతరం అక్కడే ఉన్న దుస్తుల్లో చుట్టి బెడ్‌బాక్స్‌(Bedbox)లో పెట్టి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన జితేందర్‌ కుమారుడి మృతదేహం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

You may also like

Leave a Comment