Telugu News » నరేష్ ‘మళ్లీపెళ్లి’కి క్లీన్ చిట్

నరేష్ ‘మళ్లీపెళ్లి’కి క్లీన్ చిట్

ఆమెకు నోఎంట్రీ.!

by sai krishna

సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య ‘మళ్లీ పెళ్లి’ చిత్ర విడుదలపై వేసిన పిటిషన్ ను సివిల్ కోర్ట్ కొట్టేసింది. అంతే కాదు నరేష్ ఇంట్లోకి ఆమె వెళ్లడాన్ని కూడా నిషేధం విధించింది. దీంతో సీనియర్ నరేష్ కి నెత్తిమీదున్న మాజీ భార్యా భారం దించినట్టైంది.


ప్రముఖ నటుడు నరేశ్, ఎక్స్ వైఫ్ – రమ్య రఘుపతిల మధ్య వివాదం తెలిసిందే..ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన మళ్లీపెళ్లి చిత్రం మరింత రచ్చకు, చర్చకు తెరతీసింది. దీంతో నరేష్ మాజీ భార్య మళ్ళీ పెళ్లి( తెలుగు),మట్టే మదువే ( కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు.

అయితే ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేవని తేల్చింది.ఈ కారణంగా కేసు కొట్టివేస్తూ 2023 ఆగస్టు 1న తీర్పును వెలువరించింది.

సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను కోర్టు సమర్థించ లేనిదని, వాదనలు నిలబడేలా లేవని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది.

సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు గుర్తుచేసింది. మళ్లీ పెళ్లి చిత్రం తెలుగు, కన్నడ భాషలలో సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో విడుదలైయింది.

ఈ తీర్పు ప్రకారం అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా ఈ సినిమాని నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చని తెలిపింది.మరో కేసులో నరేష్, కుటుంబ సభ్యులు, రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది.

రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు ..రమ్య రఘుపతి పై గృహ నిషేదం కేసు పెట్టడం జరిగింది.


కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి చొరబడేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిషేధం విధించింది. ఈ మేరకు రమ్య రఘుపతికి ఆదేశాలు జారీ చేసింది.నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ నివాసం లేదు.

ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వలన అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురి అవుతున్నారని కూడా కోర్టు పేర్కొంది.

ఇటీవలే పవర్ టీవీ అనే కన్నడ ఛానల్ చేత ఇల్లీగల్ గా నరేష్ ఇంటి మీద, పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ లు జరిపిన విషయం తెలిసిందే.నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలు కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది.

సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. రమ్య రఘుపతి పై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్ కు సంబంధించి సైబర్ కోర్టు, సైబర్ సెల్‌లో సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉంది.

You may also like

Leave a Comment