Telugu News » DK Aruna : ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారో సీఎం రేవంత్‌కు తెలుసు..!!

DK Aruna : ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు అవుతారో సీఎం రేవంత్‌కు తెలుసు..!!

బీజేపీ నేతలు వరుసగా హస్తం పై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీ లోపాలను జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆటలో అరటిపండులా మారిందని అనుకొంటున్నారు.

by Venu
DK Aruna: Avoid politics in the name of Ram: DK Aruna

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కాకాపుట్టిస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇప్పటికే బీజేపీ నేతలు వరుసగా హస్తం పై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీ లోపాలను జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆటలో అరటిపండులా మారిందని అనుకొంటున్నారు.

DK Aruna: Is that why the Congress party gave six guarantees?: DK Arunaఅదేవిధంగా రాష్ట్రంలో త్రీ ముఖ్య పోరు కాస్త, ద్వి ముఖ్య పోరులా మారిందని చర్చించు కొంటున్నారు.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని డీకే అరుణ (DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ కేంద్రంలో అధికారలోకి వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు.. నేడు హైదరాబాద్ (Hyderabad), నాంపల్లి (Nampally)లోని బీజేపీ (BJP) కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, మోడీనే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది జరగదన్న విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సైతం తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మరోసారి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందని డీకే అరుణ వెల్లడించారు.. మూడో సారి మోడీ (Modi)నే ప్రధాని అని తన అభిప్రాయాన్ని తెలిపారు..

You may also like

Leave a Comment