Telugu News » సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ ఒకప్పుడు సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషి అని తెలుసా?

సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ ఒకప్పుడు సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషి అని తెలుసా?

ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో వంట మనిషి.. నేడు సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ!

by Sri Lakshmi

గుడివాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి తన వంటలతో ఓ చిన్న ఫుడ్ స్టాల్ ను ఓపెన్ చేసుకుని నడుపుకుంటున్న కుమారి ఆంటీ గురించి హైదరాబాద్ మొత్తం తెలుసు. ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె గత పదమూడేళ్లుగా ఇదే బిజినెస్ లో కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె చాలా ట్రెండింగ్ లో ఉన్నారు. మొదట్లో ఆమెకు ఐటిసి కోహినూర్ ఏరియాలో మాత్రమే పాపులారిటీ ఉండేది. అయితే.. ఆమె ఫుడ్ నచ్చడంతో ఎవరో ఆమె ఫుడ్ స్టాల్ గురించి వీడియో చేసారు. మీ బిల్ వెయ్యి రూపాయలు అయ్యింది. టు లివెర్స్ ఎక్స్ట్రా తిన్నారు కదా అని ఆమె అన్న మాటలు కూడా రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది.

అలా ఆమె ఫుడ్ స్టాల్ కు పాపులారిటీ పెరిగింది. ఊరు పేరు భైరవ కోన మూవీ యూనిట్ కూడా ఆమె ట్రెండింగ్ లో ఉండడంతో ఆమె ఫుడ్ స్టాల్ కు వెళ్లారు. మరో వైపు వైసీపీ, టీడీపీ వర్గాలు కూడా ఈమె వీడియోలను యూజ్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అస్సలు పాపులారిటీని కోరుకొని ఆమె ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు. ఆమె ఫుడ్ స్టాల్ కు వచ్చే కస్టమర్స్ వలన రోడ్స్ బ్లాక్ అవుతుండడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఆమె ఫుడ్ ట్రక్ ని స్వాధీనం చేసుకున్నారు.

Kumari Aunty: Revanth Reddy Good news for Kumari Aunty.. Important instructions to DGP..!!

దీనితో ఆమె మరింత యిబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు యాభై వేల రూపాయల బిజినెస్ ను చేసుకోవడానికి వీలు లేకుండా అయ్యిందని కుమారి ఆంటీ బాధపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఆమెకు అండగా ఉంటామని, ఆమె ట్రక్ ఆమెకు ఇచ్చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ గతంలో సింగర్ హేమ చంద్ర ఇంటిలో వంట మనిషిగా పని చేసేవారట. అప్పటి నుంచి ఈ స్థాయికి ఆమె ఎదగడం గొప్ప విషయమే.

You may also like

Leave a Comment