Telugu News » Pavitranath: ‘మొగలి రేకులు’ ఫేమ్ దయ కన్నుమూత..!

Pavitranath: ‘మొగలి రేకులు’ ఫేమ్ దయ కన్నుమూత..!

మొగలి రేకులు సీరియల్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

by Mano
Pavitranath: 'Mogali Rekulu' fame has passed away..!

బుల్లితెరపై మొగలి రేకులు(Mogalirekulu), చక్రవాకం(Chakravakam)సీరియల్‌లు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్స్‌లో స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. అయితే మొగలి రేకులు సీరియల్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్(Pavitranath) కన్నుమూశారు.

Pavitranath: 'Mogali Rekulu' fame has passed away..!

ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని ర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్.’’ అని పేర్కొన్నారు.

‘‘కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి” అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అసలేం జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక పవిత్రనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని, తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని, దీని గురించి ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment