Telugu News » Shahrukh khan: తిరుమల శ్రీవారి సేవలో షారూక్ ఖాన్

Shahrukh khan: తిరుమల శ్రీవారి సేవలో షారూక్ ఖాన్

షారుక్ తిరుమల రావడం ఇదే తొలిసారి.

by Prasanna

‘పఠాన్’ (Patan) మూవీ హిట్ తర్వాత హీరో షారుఖ్ ఖాన్(Shahrukh khan) ‘జవాన్’ (Jawan) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ షారూక్ దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు.

Shahrukh-IN tirumala

ఈ నేపధ్యంలో చెన్నై వచ్చిన షారూక్ ఖాన్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. షారుక్ తిరుమల రావడం ఇదే తొలిసారి.

కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

షారుఖ్ ను చూసేందుకు అక్కడ భక్తులు ఎగబడ్డారు. షారూక్ తో సెల్ఫీలు కోసం పోటి పడ్డారు.  షారుఖ్ ఖాన్ ఉన్నంతవరకు ఆయన చూసేందుకు భక్తులు పోటీ పడటంతో ఆలయమంతా  హడావిడి కనిపించింది.

షారుఖ్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు.

You may also like

Leave a Comment