Telugu News » Bad accident : రాజ్ స్థాన్ లో రోడ్డు ప్రమాదం…6 మంది మృతి..!!

Bad accident : రాజ్ స్థాన్ లో రోడ్డు ప్రమాదం…6 మంది మృతి..!!

రాజస్థాన్ లోని దౌసా జిల్లా(Dausa District) మండవార్(Mandwar)పోలీస్ స్టేషన్ పరధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

by sai krishna

రాజస్థాన్ లోని దౌసా జిల్లా (Dausa District) మండవార్(Mandwar)పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 6 మంది మృతి చెందగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో కొందరి పరిస్థితి విషంగా ఉంది.


మంగళవారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  అల్వార్‌ నుంచి మహ్వా వైపు కూల్‌డ్రింక్స్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు..మహ్వా(Mahwah) నుంచి మండవార్‌ వైపు వెళ్తున్న జీపు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహ్వా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(Community Health Centre)కు తరలించారు.

అక్కడ ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు జైపూర్‌(Jaipur)కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయా వాహనాలను పోలీసులు జేసీబీ సహాయంతో తొలగించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment