Telugu News » Vande Bharath : వందేభారత్ ట్రైన్ లో సిగరెట్ కాల్చాడు.. ఏమైందంటే !

Vande Bharath : వందేభారత్ ట్రైన్ లో సిగరెట్ కాల్చాడు.. ఏమైందంటే !

వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ముప్పు తప్పింది

by sai krishna

వందేభారత్ ఎక్స్ ప్రెస్(Vande bharath express) కు ముప్పు తప్పింది.తిరుపతి(Tirupathi) నుండి సికింద్రాబాద్‌కు                          ( Secunderabad) పయనమైన వందేభారత్ రైల్లో హఠాత్తుగా పొగలు రావడం మొదలయ్యాయి.

కారణం ఏంటని ఆరాతీస్తే..ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా మునుబోలు దగ్గర మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ట్రైన్ బాత్ రూమ్‌లో సిగరెట్ అక్కడే పడేయడంతో రైల్లో పొగలు వ్యాపించాయి.

రన్నింగ్ ట్రైన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కొందరు ప్రయాణికులు చైన్ లాగారు. ట్రైన్ ఆగిన వెంటనే ప్రయాణికులంతా భయంతో కిందకు దిగి పరుగులు తీశారు.

అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తి రైలు నుండి దూకి పారిపోతుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు.దీంతో అరగంటకు పైగా రైలు ఆగిపోయింది. కాసేపటికి పొగలు తగ్గడంతో ట్రైన్ హైదరాబాద్ కు బయలుదేరింది.

You may also like

Leave a Comment