Telugu News » YS Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..?

YS Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..?

రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడిచింది. అయితే, ఆ వార్తలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. ప్రేమించిన అమ్మాయితోనే తన కుమారుడి పెళ్లి చేస్తున్నట్లు వెల్లడించారు.

by Mano
YS Sharmila: YS Sharmila's son's wedding fix.. Where is the venue..?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) షర్మిల కుమారుడు రాజారెడ్డి(Rajareddy) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడిచింది. అయితే, ఆ వార్తలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. ప్రేమించిన అమ్మాయితోనే తన కుమారుడి పెళ్లి చేస్తున్నట్లు వెల్లడించారు.

YS Sharmila: YS Sharmila's son's wedding fix.. Where is the venue..?

నూతన సంవత్సరం సందర్భంగా వైఎస్ షర్మిల X(ట్విట్టర్) వేదికగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి ఇంట్లో నిర్వహించే శుభకార్యానికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియాతో 2024 జనవరి 18న నిశ్చితార్థం వేడుక జరుగనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా 2024 ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తామన్నారు. తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోనున్నట్లు షర్మిల వివరించారు.

ఇక వైఎస్ రాజారెడ్డి విషయానికొస్తే.. యూఎస్‎లో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి అనే యువతిని ప్రేమించారు. గతంలో వీరిద్దరూ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. అంతేకాదు.. వైఎస్ విజయమ్మ ఆమెకు చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో వీరిపెళ్లి వార్తలకు బలం చేకూరింది. ఇక ప్రియా అట్లూరి కూడా యూఎస్‎లోనే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఈమె కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయే.

ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని తెలుస్తోంది. అట్లూరి శ్రీనివాస్ చంద్రబాబుకు కూడా సుపరిచితులు. ఈ కుటుంబానికి చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్‎ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment