Telugu News » Edit option : గ్రూప్-3 అభ్యర్థులు…ఇది మిస్ అయితే నో ఛాన్స్..!?

Edit option : గ్రూప్-3 అభ్యర్థులు…ఇది మిస్ అయితే నో ఛాన్స్..!?

గ్రూప్-3 ఉద్యోగార్థులకు టీఎస్ పీఎస్సీ(TS PSC)గుడ్ న్యూస్ చెప్పింది.దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన తప్పులు సరిదిద్దుకునేందుకు సెకెండ్ ఛాన్స్ ఇచ్చింది.

by sai krishna

గ్రూప్-3 ఉద్యోగార్థులకు టీఎస్ పీఎస్సీ(TS PSC)గుడ్ న్యూస్ చెప్పింది.దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన తప్పులు సరిదిద్దుకునేందుకు సెకెండ్ ఛాన్స్ ఇచ్చింది.ఈ మేరకు ఎడిట్ అప్షన్ ను అందుబాటులోకి తెచ్చిది. ఈనెల16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.

మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ల స్టార్ట్ అయి..ఫిబ్రవరి 23న ముగిసింది. గ్రూప్-3 పోస్టులకు 5లక్షల 36 వేల 477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.


అభ్యర్థులు తమ అప్లికేషన్లలో నమోదు చేసిన పేర్లు, వివరాల డేటాలో తప్పులుంటే సరిదిద్తుకోవాలని కమిషన్ సూచించింది. అఫీషియల్ వెబ్ సైట్(website)లో ఉన్న ఎడిట్ ఆఫ్షన్ లింక్ క్లిక్ చేసి గ్రూప్-3 క్యాండిడెట్స్ తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని తెలిపింది.

ఇదే లాస్ట్ ఎడిట్ అప్షన్(Last edit option)అని..దీన్నే ఫైనల్ డేటాగా పరిగణిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడిచింది.అయితే, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ మూడు నాలుగు వారాల్లో పరీక్ష తేదీలుండేలా టీఎస్పీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేసుకుంది.

కానీ.. గ్రూప్-2ను నవంబర్ 2,3 తేదీలకు రీషెడ్యూలు(Reschedule)చేయటంతో గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. గ్రూప్ 2 కంటే ముందే అక్టోబర్ లో గ్రూప్-3 పరీక్ష ఉంటుందా..? లేదా గ్రూప్-2 తర్వాత నిర్వహిస్తారా.. అనేది ఎడిట్ ఆఫ్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment