Telugu News » ఫేస్ బుక్ ప్రేమ.. పాకిస్తాన్ చెక్కేసిన భారతీయ మహిళ!

ఫేస్ బుక్ ప్రేమ.. పాకిస్తాన్ చెక్కేసిన భారతీయ మహిళ!

by admin

పబ్ జీ ప్రేమ ఉదంతం ఓ కొలిక్కి రాకముందే మరో ఆన్ లైన్ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ సీన్ రివర్స్. ప్రియుడి కోసం ఇండియా నుంచి ఇద్దరు పిల్లలున్న ఓ వివాహిత పాకిస్తాన్ చెక్కేసింది.

Seema came from Pakistan and Anju reached PAK from India… How common is the story of both

వివరాల్లోకి వెళితే.. అంజు, అరవింద్ దంపతులు. రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్ బుక్ లో పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే.. వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటం వల్ల ఆమెను విడిచిపెట్టారు. జైపుర్ లో ఉన్న స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్నానని చెప్పి.. తన భార్య పాకిస్తాన్ వెళ్లిపోయిందని అరవింద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

‘‘ఆదివారం రాత్రి నా భార్య అంజు.. వాయిస్ కాల్ చేసింది. లాహోర్ లో ఉన్నానని చెప్పింది. ఆమె పాకిస్తాన్ ఎందుకు వెళ్లిందో? వీసా ఎలా పొందిందో నాకు తెలియదు. నా భార్య ఫోన్ లోని మెసేజ్ లను నేనెప్పుడూ తనిఖీ చేయలేదు. బహుశా ఇదే నేను చేసిన తప్పేమో’’ అంటూ వాపోయాడు. తన భార్య అంజు తిరిగివచ్చాక ఆమెతో కలిసి ఉండాలో? లేదో? పిల్లలు నిర్ణయిస్తారని తెలిపాడు. అంజు తనకు తెలియకుండా బయటకి వెళ్లడం ఇదే మొదటిసారి అని.. తనను మోసం చేసిందని చెప్పుకొచ్చాడు అరవింద్.

You may also like

Leave a Comment