Telugu News » SS Rajamouli Son : ఫస్ట్ టైం పెను ప్రమాదాన్ని కళ్లారా చూశామన్నా ఎస్ఎస్ రాజమౌళి కొడుకు.. ఏమైందంటే?

SS Rajamouli Son : ఫస్ట్ టైం పెను ప్రమాదాన్ని కళ్లారా చూశామన్నా ఎస్ఎస్ రాజమౌళి కొడుకు.. ఏమైందంటే?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Tollywood)లో ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) గురించి తెలియని వారుండరు. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రం సెస్సెనషనల్ హిట్ అయ్యింది. దీనికి తోడు ఆయన ఇటీవల తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్(RRR) మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డులను సైతం కొల్లకొట్టింది.

by Sai
SS Rajamouli's son saw a big accident first time.. What happened?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Tollywood)లో ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) గురించి తెలియని వారుండరు. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రం సెస్సెనషనల్ హిట్ అయ్యింది. దీనికి తోడు ఆయన ఇటీవల తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్(RRR) మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డులను సైతం కొల్లకొట్టింది. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ రేంజ్ ఏంటి అనేది హాలీవుడ్‌‌కు సైతం పాకింది.

SS Rajamouli's son saw a big accident first time.. What happened?

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసుకుంటూ ఉంటారనే టాక్ నుంచి ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్స్ సైతం టాలీవుడ్‌లో పనిచేసేలా చేసేలా సీన్ క్రియేట్ చేసిన ఘనత ఆయన సొంతం. ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క ప్లాప్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

ఎస్ఎస్ రాజమౌళితో కలిసి వర్క్ చేయాలని ఎంతోమంది నిర్మాతలు, డైరెక్టర్స్, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అంతటి స్థాయికి ఈ డైనమిక్ డైరెక్టర్ చేరుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జనవరిలో జరిగిన ఆస్కార్ వేడుకల్లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సైతం జక్కన్న మూవీ మేకింగ్ స్టైల్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే.

అంతటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం మహేశ్ బాబుతో మూవీ చేస్తున్నారు.దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి ఫ్యామిలీతో కలిసి జపాన్ ట్రిప్‌లో ఉన్నారు. అయితే, అక్కడ వారు పెనుప్రమాదాన్ని కళ్లారా చూసినట్లు ఎస్ఎస్ కార్తీకేయ(SS Karthikeya) సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌(X)‌లో ట్వీట్ చేశారు.

‘మేము ఓ బిల్డింగ్ లోని 28వ ఫ్లోర్ లో ఉన్నాం.అప్పుడే మెల్లిగా భూమి కంపించడం స్టార్ట్ అయ్యింది. జపాన్‌లో తొలిసారి భూకంపం ఎలా ఉంటుందో చూశాం. చాలా భయం వేసింది. కానీ జపానీస్ మాత్రం ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా వాళ్లు లైట్ తీసుకున్నారు.మొత్తానికి భూకంపాన్ని ఎక్స్ పీరియన్స్ చేశాం’ అంటూ కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment