Telugu News » Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో నటి ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం

Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో నటి ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం

ప్రముఖ నటి ఊర్వశి రౌతేలాకు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ చేదు అనుభవాన్ని మిగిల్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ బ్యూటీ తన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది

by Mano
Urvashi Rautela: Actress Urvashi Rautela had a bitter experience in India-Pak match

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన ప్రపంచకప్‌ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను అభిమానులతో పాటు సెలబ్రెటీలు వీక్షించారు. ఈ మ్యాచ్ అభిమానులకు ఆనందం పంచినా ప్రముఖ నటి ఊర్వశి రౌతేలాకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Urvashi Rautela: Actress Urvashi Rautela had a bitter experience in India-Pak match

మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ బ్యూటీ తన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తాను పోగొట్టుకున్న ఐఫోన్ మామూలుది కాదని.. అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని చెప్పుకొచ్చింది. అది ఎవరికైనా దొరికితే ఇవ్వాలని కోరింది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేసింది.

ఆమె పోస్టును చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు. బంగారం లాంటి ఫోన్ దొరికితే ఎవరైనా తిరిగిస్తారా? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఊర్వశి ఇటీవల తెలుగులో స్కంద సినిమాలో మెరిసింది.

You may also like

Leave a Comment