Telugu News » Parineeti Chopra: ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్..!

Parineeti Chopra: ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్..!

తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూసి పరిణీతి చోప్రా తాజాగా స్పందించింది. సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలతో తన మనసు నిండిందని ఆనందంగాన్ని వ్యక్తం చేసింది.

by Mano
Parineeti Chopra: Tears of joy did not stop.. Star heroine's emotional tweet..!

ప్రియాంక చోప్రా(Priyanka Chopra) బంధువుగా పరిణీతి చోప్రా(Parinithi Chopra) బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్'(Ladies vs. Ricky Bahl)లో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా తర్వాత ‘కిల్ దిల్’, ‘డిష్యూం’, ‘గోల్ మాల్ అగైన్’, ‘కేసరి’, ‘సైనా’ వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా ప్రేక్షకులను అలరించింది. తాజా ఆమె నటించిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’(Amarsingh Chunkila).

Parineeti Chopra: Tears of joy did not stop.. Star heroine's emotional tweet..!

ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల జీవిత కథను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 27ఏళ్ల వయసులో అమర్‌ సింగ్ హత్యా నేపథ్యంలో సినిమాను చిత్రీకరించారు. పంజాబీ, బాలీవుడ్ నటుడు దిల్జిత్ దొసాంజ్, నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది ఈ మూవీ.

ఇందులో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూసి పరిణీతి చోప్రా తాజాగా స్పందించింది. సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలతో తన మనసు నిండిందని ఆనందంగాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు. పరిణీతి ఈజ్ బ్యాక్.. అనే మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీన్ని నేను అస్సలు ఊహించలేదు. అవును.. నేను తిరిగొచ్చేశా.. ఎక్కడికీ వెళ్లను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్దాను గతేడాది వివాహం చేసుకున్న పరిణీతి చోప్రా ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతుందని అంతా అనుకున్నారు. అయితే తాజా అమర్‌సింగ్ చంకీలపై ట్వీట్‌ చేసి సినిమాలు కొనసాగిస్తానని క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకున్నాక పరిణీతి ఇక సినిమాలు చేయదేమోనన్న వార్తలకు చెక్‌పెట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

You may also like

Leave a Comment