Telugu News » Rashmigautam: విషాదంలో యాంకర్ రష్మీ.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్..!

Rashmigautam: విషాదంలో యాంకర్ రష్మీ.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్..!

అయితే రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మృత్యువాతపడింది. ఈ విషయాన్ని తెలుపుతూ రష్మీ ఓ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయింది.

by Mano
Rashmi Gautam: Anker Rashmi in tragedy.. Emotional post on Insta..!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmigautam) గురించి తెలిసిందే. యాంకర్‌గా పలు షోస్‌తో పాటు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఏదో ఒక విషయానికి సంబంధించి పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Rashmi Gautam: Anker Rashmi in tragedy.. Emotional post on Insta..!

రష్మీకి జంతువులంటే మహా ఇష్టం. వాటికేమైనా హాని కలిగిస్తే ఏమాత్రం ఊరుకోదు. వెంటనే రెస్పాండ్ అవుతుంది. మూగ జీవాలపై ఉన్న ప్రేమతో నెటిజెన్స్‌తో సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తన పెంపుడు కుక్కకి చుట్కి గౌతమ్(Chutki Gautham) అని పేరు పెట్టింది. అయితే రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన చుట్కి మృత్యువాతపడింది.

ఈ విషయాన్ని తెలుపుతూ రష్మీ ఓ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఆ కుక్కపై పూలమాలలు వేసిన ఫొటోను షేర్ చేసింది. రీసెంట్‌‌గా చుట్కితో ఎంత ప్రేమగా తాను గడిపానో అనే విషయాన్ని తెలిపింది. చుట్కి గౌతమ్ తన బేబీ గర్ల్ అని రష్మీ పోస్ట్ చేసింది. అయితే చుట్కీ ఎందుకు చనిపోయిందో మాత్రం వెల్లడించలేదు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

You may also like

Leave a Comment